- జైశంకర్ భూపాలపల్లి వీఆర్ సీఐ బండారి సంపత్ దారుణం
- స్థానిక మహిళతో సంబంధం, ఆమె టీనేజ్ కూతురిపై కన్ను
- అదను చూసి బాలికపై అత్యాచారం,
- బాలిక తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, భూపాలపల్లి సీఐగా ఉన్న బండారి సంపత్ 2022లో కాకతీయ యూనివర్సిటీ పోలీస్స్టేషన్ ఎస్సైగా పనిచేశాడు. ఆ సమయంలో హనుమకొండలోని ఓ కాలనీకి చెందిన మహిళతో సన్నిహితంగా మెలిగాడు. ఖమ్మం జిల్లాకు సీఐగా బదిలీ అయ్యాక కూడా వారి సాన్నిహిత్యం కొనసాగింది.
ఇటీవల జైశంకర్ భూపాలపల్లికి వీఆర్ సీఐగా బదిలీపై వచ్చిన అతడు మహిళ కూతురిపై కన్నేశాడు. అదను చూసి అత్యాచారానికి ఒడిగట్టాడు. తల్లికి బాలిక విషయం చెప్పడంతో ఆమె కేయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.